మహేశ్వరం : దేవాలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధి శ్రీనగర్లోని శ్రీబాలాజీ వెంకటేశ్వరస్వామి, జెన్నాయిగూడలోని శ్రీలక్ష్మి నర్సింహ్మస్వామి దేవాలయాలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటు న్నానని అన్నారు. కరోన నుండి ప్రజలకు ఉపశమనం కలగాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత 7 సంవత్సరాల నుండి ప్రజలు ఎదుర్కొంటున్న చాలా సమస్యలను సీఎం కేసీఆర్ దూరం చేయడం జరిగిందని ఆమె అన్నారు.
తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న కేసీఆర్కు భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆమె వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తీగల క్రిష్ణారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితాహరినాథ్రెడ్డి, తుక్కుగూడ మున్సిపాలిటీ చైర్మన్ కాంటెకార్ మధుమోహన్, వైస్ చైర్మన్ భవాని వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.