సీఎం కేసీఆర్ చిత్తశుద్ధి వల్లే సాధ్యం
హోంమంత్రి మహమూద్అలీ
సీపీఎల్లో ఇంధన అవుట్లెట్ ప్రారంభోత్సవం
గోల్నాక, మే 25 : సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతో రాష్ట్రంలో పోలీస్ శాఖ మరింత బలోపేతం అయ్యిందని హోంమంత్రి మహమూద్అలీ అన్నారు. బుధవారం అంబర్పేట ఎస్ఏఆర్ సీపీఎల్లో పోలీసుల వాహనాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇంధన అవుట్లెట్ను డీజీపీ మహేందర్రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు.
కార్యక్రమంలో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్త, నగర పోలీస్ కమిషనర్ సీవీ.ఆనంద్, అడిషనల్ డీజీపీ సంజయ్ కుమార్జైన్, రాష్ట్ర పీటీవో ఎస్పీ ఎ.రాజేశ్, పోలీసు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.