చిక్కడపల్లి, అక్టోబర్ 2 : తెలంగాణ సహకార గృహ నిర్మాణ సంఘాల సమాఖ్య(తెలంగాణ హౌస్ఫెడ్) చైర్మన్గా కె.నవనీత్రావు, వైస్ చైర్మన్గా గోవర్దన్రెడ్డిలు ఎన్నికయ్యారు. నవనీత్రావు చైర్మన్గా ఎన్నిక కావడం ఇది రెండోసారి. శనివారం బాగ్లింగంపల్లిలోని సమాఖ్య ప్రధాన కార్యాలయంలో ఎన్నికల అధికారి కె.శ్రీరాం సమక్షంలో నూతన పాలకవర్గం ఎన్నిక జరిగింది. చైర్మన్గా నవనీత్ రావు, వైస్ చైర్మన్గా గోవర్దన్రెడ్డి, డైరెక్టర్లుగా ఎ.కిషన్రావు, ప్రసన్న, ఎం.గోవర్దన్రెడ్డి, జి.రవీందర్రెడ్డి, ప్రభాకర్రావు, జూలూరి కృష్ణమూర్తిలు ఎన్నికయ్యారు.
ప్రభుత్వ సహకారంతో హౌస్ఫెడ్ను మరింత అభివృద్ధ్ధి చేస్తామని నూతన చైర్మన్ నవనీత్రావు అన్నారు. చైర్మన్గా ఎన్నికైన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఐదేండ్లలో రూ.42 కోట్ల బకాయిలను వసూలు చేసినట్లు చెప్పారు. మధ్యతరగతి, చిన్న వ్యాపారులకు గృహ రుణాలు అందిస్తామని, ప్రభుత్వ సహకారంతో కొత్త ప్రాజెక్టులు తెచ్చి సమాఖ్యను మరింత అభివృద్ధి చేస్తామని హామీఇచ్చారు.