నమస్తే తెలంగాణ, నెట్వర్క్ : కేంద్ర ప్రభుత్వం విధానాలతో దేశంలోని ఏ ఒక్క వర్గమూ సంతృప్తిగా లేదు. సబ్బండ వర్గాలకు న్యాయం జరగాలంటే దేశరాజకీయాల్లోకి ముఖ్యమంత్రి కేసీఆర్ రావాలని సకలజనులు కోరుకుంటున్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే స్థాయి కేసీఆర్కే ఉందని కరాఖండిగా చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యత ఇస్తున్న కేసీఆర్లాంటి నాయకుడు దేశానికి అవసరమని, అందుకోసమైనా కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టాలని ముక్తకంఠంతో నినదిస్తున్నారు.
కేసీఆర్పై నమ్మకం ఉంది
తెలంగాణను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం శుభపరిణామం. ఇప్పటికే సీఎం కేసీఆర్ అర్చకులకు వేతనాలు ఇచ్చి ఆదుకుంటున్నారు. ఇక దేశ రాజకీయాల్లోకి వస్తే..దేశంలోని అర్చకుల కుటుంబాలన్నీ బాగుపడుతాయి. అన్ని వర్గాల సంక్షేమానికి కేసీఆర్ కృషి చేస్తారనే నమ్మకం ఉంది.
– తెలిదేవరపల్లి సీతారామశాస్త్రి, తెలంగాణ బ్రాహ్మణుల సంఘం ప్రధాన కార్యదర్శి
చారిత్రక అవసరం
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం చారిత్రక అవసరం. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పరిపాలన చేస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని యావత్ దేశం కోరుకుంటున్నది. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని సంపదను ప్రజలకు పంచుతుంటే, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజా సంపద, ఆస్తులను ఒక్కొక్కటిగా విక్రయిస్తున్నది. ఇలాంటి సమయంలో బీజేపీపై పోరాడే ప్రత్యామ్నాయ శక్తి కేసీఆర్కే ఉంది. ప్రజలందరికీ సంక్షేమఫలాలు అందాలంటే కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలి.
– మారోజు రామాచారి, ఆర్కేపురం
కుల వృత్తులకు గుర్తింపు
సీఎం కేసీఆర్ పాలనలోనే కుల వృత్తులకు గుర్తింపు వచ్చింది. చెరువుల్లో ఉచితంగా చేపల పిల్లలను పంపిణీ చేసి ఉపాధి చూపిండు. చేపలను మార్కెట్లో అమ్ముకోవడానికి వసతులు కల్పించాడు. ఉన్న ఊర్లోనే మాకు డబ్బులు సంపాదించుకునే అవకాశం దొరికింది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు చాలా మంచి జరుగుతుంది.
– పుట్నాల శ్రీకాంత్, ముదిరాజ్ సంఘం నాయకుడు, పూడూరు
దేశరాజకీయాల్లోకి కేసీఆర్ రావాలి
రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్న సీఎం కేసీఆర్ దేశ రాజకీయాలలోకి రావాలి. దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుంది. రాష్ట్రంలో కుల సంఘాల వారినందరినీ ఒకచోటికి చేర్చి వారికి అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది. గతంలో ఎక్కడాలేని విధంగా కులాల వారిగా నిధుల కేటాయింపు, ప్రత్యేక భవనాల నిర్మాణాలను చేపట్టడం నిజంగా అద్భుతం.
– ఉల్కుందకార్ దిలీప్ కుమార్, జియాగూడ ఆరెకటిక సంఘం నాయకులు
బీజేపీని తరిమికొట్టాలి
బీజేపీ సర్కార్ దేశాన్ని ముందుకు నడిపించడంలో పూర్తిగా విఫలమైంది. కార్పొరేట్ వ్యవస్థలకు కొమ్ముకాస్తూ రైతులు, కార్మికుల కష్టాలను పట్టించుకోవడం లేదు. ఎనిమిదేండ్ల పాలనలో కేంద్రం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. రానున్న ఎన్నికల్లో కేంద్ర సర్కార్ కూలడం ఖాయం. తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్ దేశ రాజకీయాలోకి వెళ్లి బీజేపీ సర్కార్ను తరిమికొట్టాలన్నదే ప్రజల అభిమతం. – కాముని నర్సింహారెడ్డి, రెడ్డి జేఏసీ అధ్యక్షుడు, కూకట్పల్లి
దేశమంతా బాగుపడుతుంది
సమాజంలోని బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచే నాయకుడు సీఎం కేసీఆర్ ఒక్కడే. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పేదలకు సంక్షేమ ఫలాలను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దే. నాయీబ్రాహ్మణులతో పాటు అన్ని సామాజిక వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నారు. గతంలో బడుగు, బలహీన వర్గాల ప్రజలను ఓటర్లుగానే చూశారు. కానీ.. కేసీఆర్ వెనుకబడిన వర్గాలను ముందుకు నడిపిస్తూ సమసమాజ స్థాపన కోసం పనిచేస్తున్నారు. ఇలాంటి గొప్ప నాయకుడు దేశ రాజకీయాల్లోకి వెళ్తే దేశమంతా బాగుపడుతుంది.
– పి.నర్సింహ నాయీ, నాయీబ్రాహ్మణ సంఘం మాజీ అధ్యక్షుడు, మేడ్చల్ జిల్లా
అందరికీ మేలు
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాలలోకి వస్తే అందరికీ మేలు జరుగుతుంది. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు పథకాలను అమలు చేస్తూ ప్రజలతో నీరాజనాలు అందుకుంటున్నారు. రాష్ట్రంలో వెనుకబడిన కులాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారు. అదే విధంగా ఆయన దేశ వ్యాప్తంగా అందరికీ సంక్షేమ ఫలాలు అందించాలి. దీని కోసం సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరించాలి.
– గౌలికార్ నర్సింగ్ రావు, రాష్ట్ర ఆరెకటిక ట్రస్టు చైర్మన్
కులవృత్తులకు న్యాయం చేస్తారు
కుల వృత్తుల వారి కష్టాలు సీఎం కేసీఆర్కు తెలుసు. రాష్ట్రంలో నాయీ బ్రహ్మణులను అన్ని విధాలుగా ఆదుకుంటుండు. సెలూన్కు ఉచితంగా కరెంటు ఇస్తున్నాడు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో అడుగుపెడితే మాలాగే దేశంలోని కుల వృత్తుల వారికి న్యాయం జరుగుతుంది.
– రమేశ్ నాయీ, నాయీ బ్రహ్మణ సంఘం నాయకులు, కందుకూరు
దళితుల జీవితాల్లో వెలుగులు
సీఎం కేసీఆర్ దేశ రాజీకీయాల్లోకి వస్తే దేశంలో ఉన్న దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతాడనే నమ్మకం ఉంది. దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ దళితులకు పెద్దపీట వేయడం సంతోషకరం. ముఖ్యంగా దళితబంధు పథకంతో దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. మాలాంటి బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలనే పెద్ద మనస్సుతో ఇలాంటి పథకాలు పెట్టారు. ఇవే కార్యక్రమాలు దేశమంతటా అమలు చేస్తారు.
– ఈఆర్ బాల్రాజు, బొల్లారం, ఆదర్శ నగర్ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు
రైతులకు ఎంతో మేలు
సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. వ్యవసాయాన్ని పండుగ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే రైతులకు ఎంతో లబ్ధి చేకూరుతుంది. దశాబ్దాలుగా వడ్డెరలను పట్టించుకున్న వారు లేరు. వడ్డెర సంఘానికి హైదరాబాద్లో ఎకరం స్థలం ఇచ్చి, భవన నిర్మాణానికి రూ.కోటి ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలలో ప్రవేశిస్తే అన్ని వర్గాలకు మేలు జరుగుతుంది.
– వేముల యాదయ్య, రాష్ట్ర అధ్యక్షుడు వడ్డెర ఐక్య వేదిక
దేశానికి కేసీఆర్ అవసరం
ప్రజల కష్ట సుఖాలు తెలిసిన నాయకుడు సీఎం కేసీఆర్. దేశానికి కేసీఆర్లాంటి నాయకుడు ఎంతో అవసరం. బీజేపీ ప్రభుత్వం అవలం బిస్తున్న విధానాలతో ప్రజలు సతమత మవుతున్నారు. ఇలాంటి తరుణంలో తెలంగాణను ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన కేసీఆర్ లాంటి నాయకుడు దేశ రాజకీయాల్లోకి రావాలి. అప్పుడే దేశం అగ్రగామిగా నిలుస్తుంది. – కృష్ణ యాదవ్, కృష్ణ కాలనీ
కేసీఆర్ అవసరం ఉంది
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. బీజేపీ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు ధరలను పెంచి, సామాన్యులు బతుకకుండా చేస్తుంది. సీఎం కేసీఆర్ అందజేసిన గొర్రెలతోనే గొల్ల కురుమలు అభివృద్ధి చెందారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే అందరికీ న్యాయం చేస్తాడు.
– గౌర్ల మల్లేశ్ కురమ, మేడ్చల్ పట్టణ కురుమ సంఘం ప్రధాన కార్యదర్శి, మేడ్చల్ )
దేశానికి కేసీఆరే ప్రత్యామ్నాయం
ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వచ్చి దేశాన్ని అభివృద్ధి పట్టాలు ఎక్కించాలి. మోడీ నేతృత్వంలో అధోగతి పాలవుతున్న దేశానికి కేసీఆరే ప్రత్యామ్నాయం. ఆయన నాయకత్వంలోనే దేశం పురోగమిస్తుంది. ఒకవైపు దేశాన్ని కార్పొరేట్ సంపన్నులకు దోచిపెడుతూ, మరోవైపు పేదలపై ధరల భారం మోపుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కేసీఆర్ నాయకత్వంలో దేశంలో రాజకీయ పునరేకీకరణ జరగాలి. దేశంలో మోడీని ఢీకొట్టగలిగిన ఏకైక నేత కేసీఆరే. ఆయన నాయకత్వంలో జాతీయ రాజకీయాల్లో కీలక మార్పు తథ్యం.
– డాక్టర్ వట్టికూటి రామారావుగౌడ్
కేసీఆర్ను స్వాగతిస్తున్నాం
కులం, మతం అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలకు సమ ప్రాధానత్యను ఇస్తూ, అన్ని పండుగలకు తగిన గుర్తింపు ఇస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్. ఇలాంటి నాయకుడు జాతీయ రాజకీయాల్లోకి రావడంతో దేశంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉంటారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్నది. ఇదే మాదిరిగా దేశ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పాటుపడతారు. ఇలాంటి నాయకుడు దేశ రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగతిస్తున్నాను.
– రౌతు రాజయ్య, తెలంగాణ మాల ఉప కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, అంబేద్కర్నగర్
వెనుకబడిన వర్గాలకు మేలు
ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం వల్ల వెనుకబడిన వర్గాలకు మేలు జరుగుతుంది. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అమలు చేస్తున్న పథకాలు దేశమంతటా అందితే ఆయా వర్గాలు అభివృద్ధిలోకి వస్తాయి. అన్నదాతకు రైతు బంధు, పేదలకు ఆసరా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు దేశవ్యాప్తంగా అమలవుతాయి. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగతిస్తున్నాం.
-తూంకుంట అరుణ్ కుమార్, తెలంగాణ కురుమ యువత అధ్యక్షుడు
పేదల కోసం కేసీఆర్ రావాలి
దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది. దేశంలోని పేదలు, రైతులు, మధ్యతరగతి కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని స్థాపించుకుంటాం. దేశవ్యాప్తంగా పేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి.
– కే. కృష్ణ, ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
ఉపాధి మార్గాలు పెరుగుతాయి
స్వరాష్ట్ర లక్ష్యాన్ని సాధించి బంగారు తెలంగాణ దిశగా సమర్థంగా అడుగులు వేయిస్తున్న సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలలోకి రావాల్సిన అవసరం ఉన్నది. అన్ని వర్గాల సమున్నత శ్రేయస్సే ధ్యేయంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఆయన దేశ రాజకీయాలలోకి రావటం ద్వారా దశ, దిశ మార్చగలరన్న సంపూర్ణ విశ్వాసం ఉన్నది. వ్యవసాయం, పరిశ్రమలు, విద్యుత్, ఐటీ సహా మరెన్నో రంగాలను గాడిన పెట్టడమే కాకుండా వేలాది ఉద్యోగాల కల్పనకు ఆయన బాటలు వేస్తున్నారు. ఈ విధానాలను జాతీయ స్థాయిలో అమలు పరిస్తే మరింత మందికి ఉపాధి మార్గాలు పెరుగుతాయి.
– పోచంపల్లి రమణారావు, తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు
కులవృత్తులకు జీవం
బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే కులవృత్తులను సమాధి చేస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తేనే దేశ వ్యాప్తంగా కుల వృత్తులకు జీవం పోస్తారు. బీజేపీ పాలిత రాష్ర్టాలలో కుల వివక్షత బుసలు కొడుతున్నది. కేసీఆర్ జాతీయ రాజకీయాలలోకి వస్తే సామాజిక న్యాయం జరుగుతుంది.
– బేర బాలకృష్ణ, మాలల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు