మహేశ్వరం నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది
పార్టీ కోసం కష్టపడేవారికి తగిన గుర్తింపు
ప్రజల కోసం పరితపించే కేసీఆర్కు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలి
నియోజకవర్గం టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి
ఆర్కేపురం, జూలై 3 : ఆర్కేపురం డివిజన్ కిన్నెర (స్వాగత్) ఫంక్షన్ హాల్లో మహేశ్వరం నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం డివిజన్ మాజీ అధ్యక్షుడు మురుకుంట్ల అరవింద్శర్మ అధ్యక్షతన జరుగగా.. ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాంద్రారెడ్డి హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని సంక్షేమ పథకాలు రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. ప్రజల కోసం పరితపించే కేసీఆర్కు మనమంతా అండగా ఉండి అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. మహేశ్వరం నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఓ కుటుంబంగా ఉందామని చెప్పారు. ఈ కుటుంబాన్ని విచ్చిన్నం చేయడానికి నాలుగు దిక్కుల శక్తులు పోరాటం చేసినా ఫలితం ఉండదన్నారు.
గ్రూప్ రాజకీయాలు చేయకుండా అందరు కలిసికట్టుగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడేవారికి తగిన గుర్తింపుతో పాటు పదవులు ఉంటాయని తెలిపారు. గ్రామస్థాయి నుంచి కార్యకర్తల సమస్యలను పరిష్కరించే విధంగా కార్యచరన ఉంటుందన్నారు. రంగారెడ్డి జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమమే సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ శ్రీధర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పాండురంగారెడ్డి, కందుకూర్ జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మీర్పేట మేయర్ దుర్గాదీపులాల్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, మన్నె జయేందర్, రాజూనాయక్, లక్ష్మయ్య, అఫ్జల్ కలీఫా, రామ్రెడ్డి, ఆర్కేపురం డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల నగేశ్, చంద్రయ్య, జిల్లెల కృష్ణారెడ్డి, నెంటూరి రవీందర్రెడ్డి, మారోజు రామాచారి, బీరెల్లి వెంకట్రెడ్డి, న్యాలకొండ శ్రీనివాస్రెడ్డి, కొండ్ర శ్రీనివాస్, కంచర్ల శేఖర్, జగన్మోహన్రెడ్డి, పెంబర్తి శ్రీనివాస్, గొడుగు శ్రీనివాస్, ఇంటూరి అంకిరెడ్డి, పటేల్ సునీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.