తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఆదివారం నగరంలో ఘనంగా నిర్వహించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రముఖులు, పాల్గొని ప్రసంగించారు.
పబ్లిక్ సర్వీస్ కమిషన్లో..
నాంపల్లిలోని పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో జాతీయ జెండాను చైర్మన్ జనార్దన్ రెడ్డి, సెక్రటరీ అనితా రామచంద్రన్, కమిషన్ సభ్యులు ఆవిష్కరించారు.
హెచ్ఎండీఏ కార్యాలయంలో..
అమీర్పేటలోని హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలో హెచ్ఎండీఏ కార్యదర్శి పి.చంద్రయ్య, హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రభాకర్, ప్లానింగ్ డైరెక్టర్లు విద్యాధర్, శ్రీనివాస్, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ విజయలక్ష్మి, ల్యాండ్ పూలింగ్ ఆఫీసర్ ప్రసూనాంబ, సూపరింటెండెంట్ ఇంజినీర్ పరంజ్యోతి, ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ సత్తయ్య, అర్బన్ ఫారెస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ విశ్వప్రసాద్, ఉద్యోగులు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
గన్పార్క్ వద్ద..
గన్పార్క్ వద్ద జరిగిన కార్యక్రమంలోపోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్గుప్తా
అటవీ శాఖ ప్రధాన కార్యాలయం అరణ్య భవన్లో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్ అండ్ హెచ్ఓఎఫ్ ఎఫ్) ఆర్ఎం డోబ్రియాల్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఉన్నతాధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
కాప్రా సర్కిల్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి
బస్ భవన్లో..
ఆర్టీసీ కేంద్ర కార్యాలయం, బస్ భవన్లో సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్, ఇతర అధికారులు
వికలాంగుల సంక్షేమ భవన్లో..
మలక్పేటలోని వికలాంగుల సంక్షేమ భవన్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేస్తున్న రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, సంస్థ జేఎండీ శైలజ, జీఎం ప్రభంజన్రావు
మియాపూర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన జాతీయ సమైక్యతా వేడుకల్లో విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్లు
ఖైరతాబాద్ పరిధిలోని వేంకటేశ్వరనగర్లో జాతీయ జెండాను ఎగురవేస్తున్న ఎమ్మెల్యే దానం నాగేందర్
డీఎంహెచ్ఎస్ క్యాంపస్ ఆవరణలో…
కోఠిలోని డీఎంహెచ్ఎస్ క్యాంపస్ ఆవరణలో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ గడల శ్రీనివాస్, డీఎంఈ డాక్టర్ రమేశ్ రెడ్డి, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్కుమార్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. టీఎన్జీవో డీఎంహెచ్ఎస్ యూనిట్ అధ్యక్షుడు మామిడి ప్రభాకర్తో పాటు డీహెచ్, డీఎంఈ, టీవీవీపీ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
– (సుల్తాన్బజార్,సెప్టెంబర్ 17)
సింగరేణి భవన్లో…
సింగరేణి భవన్లో సింగరేణి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ జె.ఆల్విన్ ముఖ్య అతిథిగా పాల్గొని తెలంగాణ తల్లి చిత్రపటానికి, సర్ధార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జనరల్ మేనేజర్ కో -ఆర్టినేషన్ ఎం.సురేశ్, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఎన్. భాస్కర్, డీజీఎంలు ప్రదీప్కుమార్, విజయేందర్ రెడ్డి, తాడబోయిన శ్రీనివాస్తో పాటు అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
– (తెలుగు యూనివర్సిటీ)
గాంధీనగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే ముఠా గోపాల్ జాతీయ జెండా, బీఆర్ఎస్ పార్టీ జెండాలను ఆవిష్కరించారు.
– చిక్కడపల్లి, సెప్టెంబర్ 17
ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు
– కేపీహెచ్బీ కాలనీ, సెప్టెంబర్ 17
ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్ డా.వెంకటరమణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
– వ్యవసాయ యూనివర్సిటీ, సెప్టెంబర్ 17
నిజాం విముక్త స్వాతంత్య్ర అమృత మహోత్సవం సమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 సందర్భంగా కింగ్కోఠిలో జరిగిన కార్యక్రమంలో నాటి పోరాటంలో నిజాంపై బాంబు వేసిన నారాయణ రావు పవార్ కూతురు కిరణ్ గోజే, ఇతిహాస సంకలన సమితి గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి ఇందు శేఖర్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
– సుల్తాన్బజార్, సెప్టెంబర్ 17
ట్రజరీ కార్యాలయంలో..
హైదరాబాద్ జిల్లా ట్రజరీ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్ జి. వసుంధర ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురువేశారు.
– అబిడ్స్,సెప్టెంబర్
ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఎండీ దానకిశోర్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. బోర్డు ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ బాబు, డైరెక్టర్లు రవికుమార్, స్వామి, సీజీఎంలు, జీఎంలు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
– సిటీబ్యూరో, సెప్టెంబర్ 17(నమస్తే తెలంగాణ)
జాతీయ సమైక్యతా దినోత్సవంలో పాల్గొన్న అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, తదితరులు
– కాచిగూడ, సెప్టెంబర్ 17