రవీంద్రభారతిలో ప్రపంచ కార్మికుల దినోత్సవం
హాజరైన మంత్రులు మల్లారెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్యాదవ్, శ్రీనివాస్గౌడ్
12 కంపెనీలకు ఉత్తమ యాజమాన్య అవార్డులు
44 మందికి శ్రమశక్తి పురస్కారాలు ప్రదానం
రవీంద్రభారతి, మే1: ప్రపంచ మే డే దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం, కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్రభారతిలో ప్రపంచ కార్మికుల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్యాదవ్, శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం మైహోం గ్రూప్, సాగర్ సిమెంట్, డాక్టర్ రెడ్డీస్ వంటి 12 కంపెనీలకు ఉత్తమ యాజమాన్యం, 44 మందికి శ్రమశక్తిపురస్కారాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మేనేజ్మెంట్ అవార్డులు
రవీంద్రభారతిలో జరిగిన ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకల్లో మోతీనగర్లోని హెచ్ఎస్ఐఎల్ లిమిటెడ్కు ఉత్తమ యాజమాన్య అవార్డును మంత్రులు తలసాని, మల్లారెడ్డి, మహమూద్ అలీ అందజేశారు.