బడంగ్పేట, ఆగస్టు 22: అభివృద్ధి – సంక్షేమంలో తెలంగాణ నంబర్ వన్గా నిలిచిందని, దేశానికే ఆదర్శంగా తెలంగాణ పథకాలు ఉన్నాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 28,33 డివిజన్లలో రూ.80లక్షల వ్యయంతో సీసీ రోడ్ల అభివృద్ధికి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో మహేశ్వరం నియోజకవర్గంలోని రెండు కార్పొరేషన్లు, రెండు మున్సిపాలిటీల్లో శరవేగంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. సీఎం కేసీఆర్ మహేశ్వరం పర్యటనలో విడుదల చేసిన రూ.150కోట్లతో రెండు కార్పొరేషన్లలో, రెండు మున్సిపాలిటీల్లో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. నియోజకవర్గంలోని అన్ని పట్టణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్పొరేషన్ పరిధిలో ట్రంక్లైన్ల, నాలాల నిర్మాణాలతో వరదనీటి ముంపు సమస్యలకు పరిష్కారం చూపుతున్నట్లు తెలిపారు. నాలాల అభివృద్ధికి రూ.110కోట్లతో మహేశ్వరం నియోజకవర్గంలో పనులు జరుగుతున్నాయన్నారు. తాగునీటి సమస్య లేకుండా చేయటానికి రూ.210కోట్లతో మిషన్భగీరథ పనులు చేపడుతున్నట్లు. నూతన పైపులైన్లు, ట్యాంకులు రిజర్వాయర్ల నిర్మాణ పనులు చేపడుతున్నామన్నారు. నియోజకవర్గంలోని బడంగ్పేట, మీర్పేట, జల్పల్లి, తుక్కుగూడల పరిధిలో ఉన్న 11 చెరువులలో రూ. 47 కోట్ల వ్యయంతో అభివృద్ధి, సుందరీకరణ పనులు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గాదీప్లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కార్పొరేటర్లు అరుణ, ప్రభాకర్రెడ్డి, ఫ్లోర్ లీడర్ అర్కల భూపాల్రెడ్డి, పార్టీ అధ్యక్షుడు అర్కల కామేశ్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
మహేశ్వరం, ఆగస్టు 22: గిరిజనుల తీజ్ పండుగకు ప్రత్యేక గుర్తింపు ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం హర్షగూడ గ్రామంలో జరిగిన తీజ్ పండుగలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితాహరినాథ్రెడ్డితో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఎంపీటీసీ విజయ్కుమార్, ఉపసర్పంచ్ రవి నాయక్, తుక్కుగూడ కౌన్సిలర్ బాధావత్ రవినాయక్, దేవ్లానాయక్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి సబితా ఇంద్రారెడ్డిని మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ప్రకటించడంతతో హర్షం వ్యక్త పరుస్తూ మంత్రిని కలిసి మహేశ్వరం మైనార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కరోళ్ల చంద్రయ్య ముదిరాజ్, మీనాజ్ పటేల్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆనందం, బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు దుడ్డు కృష్ణయాదవ్, మైనార్టీ నాయకుడు ఎస్.కే ఆజాం, నవీన్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
కందుకూరు, ఆగస్టు 22 : తనపై నమ్మకంతో మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన సీఎం కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయనని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. కార్యకర్తలు, నాయకులు కష్టపడి తనను గెలిపించి సీఎం కేసీఆర్కు కానుకగా ఇవ్వాలని కోరారు. సీఎం కేసీఆర్ సబితా ఇంద్రారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొదటిసారి కందుకూరుకు రావడంతో నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు హైదరాబాద్-శ్రీశైలం రహదారిపై ర్యాలీ నిర్వహించి పటాకులు కాలుస్తూ స్వాగతం పలికారు.
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదిశక్తి అని ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కేసీఆర్ సబితా ఇంద్రారెడ్డి ప్రకటించడంతో మంగళవారం కందుకూరులో శాలువాతో సన్మానించి.. భారీ మోజార్టీతో గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సబితా ఇంద్రారెడ్డి గెలుపు ఖాయం.. మోజార్టీ కోసం కష్టపడాలని రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్రెడ్డి తెలిపారు.
మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టంను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఎంతో కాలంగా ఎదరుచూస్తున్న సమస్య పరిష్కారం అయినట్లు తెలిపారు. లైటింగ్ సిస్టం లేక ప్రమాదాలు జరిగేవని వివరించారు. ఇక మీదట ప్రమాదాలు జరిగే అవకాశం లేదని వివరించారు.
అన్నోజిగూడ గ్రామానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గణేశ్ ముదిరాజ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డివారి ఇంటికి వెళ్లి గణేశ్ భార్య పిల్లలతో పాటు కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఆమె వెంట రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితా హరినాద్రెడ్డి, ఎమ్మెల్సీలు దయానంద్ గుప్తా, సురభి వాణీదేవీ, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురుసాని సురేందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, సర్పంచ్ కాకి ఇందిరమ్మ దశరథ, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్రెడ్డి, యూత్ నాయకులు తాళ్ల కార్తీక్, కొలను విజ్ఞేశ్వర్రెడ్డి, బొక్క దీక్షిత్రెడ్డి,గొర్రెంకల రామకృష్ణ, ప్రశాంత్చారి, తాండ్ర ఇందిరమ్మ దేవేందర్, అంజయ్యగౌడ్, దేవీపాండుగౌడ్, సామ ప్రకాశ్రెడ్డి, దామోదర్గౌడ్, గణేశ్, కృష్ణ, రాజు వెంకటేశ్, మహేందర్, విక్రంగౌడ్, అంజయ్య, దేశం కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
ఆర్కేపురం, ఆగస్టు 22 : సమాజంలో అందరూ సమానంగా ఎదగాలని సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆర్కేపురం డివిజన్కు సంబంధించిన 19 మంది బీసీలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీసీ బంధు నిరంతర పక్రియాగా కొనసాగుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆధునికతతో ఉపాధి కోల్పోయిన కుల, చేతి వృత్తుల వారికి అండగా సీఎం బీసీ కుటుంబాలకు లక్ష రూపాయలను అందజేయడం జరుగుతందన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో అన్ని వర్గాల, మతాల ప్రజలకు సమన్యాయం జరుగుతుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం అమలు కావాలంటే అది కేసీఆర్తోనే సాధ్యమవుతుందన్నారు. మరోసారి రాష్ట్రంలో బీఆర్ఎస్ను గెలిపించుకుంటే రాష్ర్టాన్ని కనీవినీ ఎరుగనిరీతిలో అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల నాగేశ్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్శర్మ, సిద్దగోని వెంకటేశ్గౌడ్, ముచ్చింతల జగన్ తదితరులు ఉన్నారు.