హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): విద్యుత్ రంగంలో దేశానికే తెలంగాణ రోల్ మోడల్ అని టీఎస్ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు తెలిపారు. తెలంగాణలో మార్చి నాటికి విద్యుత్ డిమాండ్ 16 వేల నుంచి 16,500 మెగావాట్లు దాటుతుందని చెప్పారు. నిరుడు కంటే 30 శాతం విద్యుత్ వినియోగం పెరిగిందని అన్నారు. గురువారం విద్యుత్ సౌధలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్(టీఈఈఏ) 2023 డైరీని ప్రభాకర్రావు ఆవిష్కరించి, మాట్లాడారు.
కోర్టు తీర్పునకు లోబడే విద్యుత్ ఉద్యోగులకు రివర్షన్ ఇచ్చామని, తప్పనిసరి పరిస్థితుల్లోనే రివర్షన్ చేయాల్సి వచ్చిందని, ఇది తమను బాధించిందని ప్రభాకర్రావు తెలిపారు. టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ జీ రఘుమారెడ్డి, టీఎస్ ట్రాన్స్కో, జెన్కో జేఎండీ శ్రీనివాస్రావు, టీఈఈఏ అధ్యక్షుడు శివాజీ, ప్రధాన కార్యదర్శి రామేశ్వరయ్యశెట్టి, ప్రతినిధులు సురేందర్రెడ్డి, తుల్జారాంసింగ్, నర్సింహారెడ్డి, తిరుపతయ్య, వెంకట్రామయ్య, రవికుమార్, మధు, ప్రవీణ్కుమార్, లక్ష్మయ్య, పున్నా నాయక్, శ్రీరాంనాయక్ తదితరులు పాల్గొన్నారు.