ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి..
రంజాన్ కానుకలు అందజేత
ఉప్పల్, ఏప్రిల్ 13 : ముస్లిం సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న రంజాన్ కానుకల పంపిణీని బుధవారం చిలుకానగర్ డివిజన్లోని మజీద్ ప్రాంతంలో చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే, కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీ ణ్ ముదిరాజ్తో కలిసి హాజరై ముస్లిం సోదరులకు కానుకలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అన్నివర్గాల అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తుందన్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచే లా తెలంగాణ ప్రభుత్వ పథ కాలు ఉన్నాయని తెలిపారు.
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి సీఎం కేసీఆర్ నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, ఏదుల కొండల్రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు పల్లె నర్సింగ్రావు, జెల్లి మోహ న్, కార్యదర్శి జగన్, అబ్బుబాయ్, రామానుజన్, నర్సింగ్రావు, బింగి శ్రీనివాస్, బాలకృష్ణ, అశోక్చారి, బాలేందర్, సుందర్, శ్యామ్, బాలు, అనసూయ, కనక తార, షహనాజ్, యూసుఫ్, ఖాజా, హనీఫ్ పాల్గొన్నారు.