రంజాన్ కానుకల పంపిణీలో ఎమ్మెల్యే గోపాల్
కవాడిగూడ, ఏప్రిల్ 18: రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా సోమవారం లోయర్ ట్యాంక్బండ్లోని మసీద్ ఏ ఉస్మానియా మసీదు, కవాడిగూడలోని కొత్త బజార్లోని మసీద్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రంజాన్ కానుకలను కవాడిగూడ కార్పొరేటర్ రచనశ్రీతో కలిసి ఆయన ముస్లింలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతనే అన్ని వర్గాలకు సముచిత న్యాయం జరిగిందన్నారు.సీఎం కేసీఆర్ పేదల అభివృద్ధి, సంక్షేమ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. ముస్లింలు రంజాన్ పండగను ప్రశాంతంగా జరుపుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నగర యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, డివిజన్ అధ్యక్షుడు శ్యామ్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, గోపి, జమాలోద్దీన్,ప్రభాకర్, రాజశేఖర్ గౌడ్, ఇస్మాయిల్, అన్వర్, బీజేపీ అధ్యక్షుడు మహేందర్ బాబు, నాయకులు శ్రీనివాస్ యాదవ్, శ్రీహరి, రాంచందర్, వెంకటేశ్, సురేశ్ముదిరాజ్, ప్రభాకర్, కేశవరాజు, దిలీప్ యాదవ్, నరసింహ చారి, హరీశ్గౌడ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా రాజరాజేశ్వరి ఆలయ వార్షికోత్సవం
చిక్కడపల్లి: గాంధీనగర్ డివిజన్ బాపూనగర్లోని శ్రీ రాజరాజేశ్వరి ఆలయ వార్షికోత్సవం సోమవారం ఘనం గా జరిగింది. ఈ ఈవార్షికోత్సవానికి ఎమ్మెల్యే ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ కార్పొరేటర్ ముఠా పద్మానరేశ్, యువజన విభాగనం నాయకుడు ముఠా జయసింహ హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు.ఉదయం నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలోఆలయ కమిటీ చైర్మన్ ఎ.సర్వయ్య యాద వ్, అధ్యక్షుడు సదానంద్, ప్రధాన కార్యదర్శులు దామోదర్, గంగాధర్, కోశాధికారి యాదగిరి, సభ్యులు అశోక్, నరేశ్, టీఆర్ఎస్ సీనియర్నాయకుడు నరేశ్, గాంధీనగర్ డివిజన్ అధ్యక్షుడు ఎం.రాకేశ్కుమార్ పాల్గొన్నారు.
రాంనగర్ డివిజన్ శ్రీరాంనగర్ కామన్ బస్తీలో నల్ల పోచమ్మ ఆలయ స్లాబ్ నిర్మాణ పనులను సోమవారం ఎమ్మెల్యే ముఠా గోపాల్, కార్పొరేటర్ రవి చారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మరో స్లాబ్ నిర్మాణం కోసం తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. కార్పొరేటర్ రవి చారి నూతన బోరు వేయిస్తానని బస్తీ వాసులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర నాయకుడు ముఠా జయసింహ, పార్టీ డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మోజస్ పాల్గొన్నారు.