మహేశ్వరం, ఆగస్టు 4: సర్కారు దవాఖానను ఆశ్రయిస్తున్న రోగులు సంఖ్య రోజురోజుకూ మెరుగు అవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సర్కారు దవాఖానలను బలోపేతం చేసే దిశగా సర్కారు అన్ని రకా ల వైద్యసేవలను అందుబాటులోకి తెస్తున్నారు. దీంతో ప్రజలు సర్కారు దవాఖానాలోనే నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండటంతో ప్రజలు సర్కారు దవాఖానా బాటను పడుతున్నారు. గతంలో రోగులు ఎక్కువ గా ప్రైవేటు దవాఖానలను ఆశ్రయించేవారు.. నేడు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తీసుకుంటున్న అభివృద్ధి చర్యల్లో భాగంగా ప్రైవేటు దీటుగా ప్రభుత్వ దవాఖానల్లోనే మెరుగైన వైద్యం ఉచితంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుతుండటంతో రోజురోజుకూ అవుట్ పేషంట్లు పెరుగుతున్నారు. మహేశ్వరం కమ్యూనిటీ కేంద్రానికి ప్రతి రోజు దాదాపుగా 50 నుండి 80 మంది వరకు వివిధ రకాల వైద్య సేవలకు రోగులు వస్తున్నారని, ముఖ్యంగా గర్భిణులకు సర్కారు దవాఖానలో కేసీఆర్ కిట్లను అందిస్తుండడంతో ప్రసవాల సంఖ్య పెరుగుతున్నాయని డాక్టర్లు తెలిపారు. మహేశ్వరం పీహెచ్సీలో రోగులకు 24 గంటల సర్వీసును కరోనా సమయంలో అందించారు. ప్రైవేటు దవాఖానల్లో కాన్పులకు అధిక ఫీజులకు వసూలు చేస్తుండగా అదే సర్కారు దవాఖానలో సీజేరియన్ లేకుండా కాన్పు లు చేస్తుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నాం..
మహేశ్వరం కమ్యూనిటీ కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నాం. కేసీఆర్ కిట్టు వల్ల ప్రసవాల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుంది. ప్రతి మహిళకు సాధారణ కాన్పులను చేయడానికి కృషి చేస్తున్నాము. ఒక నెలలో దాదాపుగా 150 నుండి 200 వరకు గర్భిణులు పరీక్షల నిమిత్తము వస్తుంటారు. సీజేరియన్ లేకుండా ఒక నెలలో 25 నుండి 30 మందికి డెలివరీలను చేస్తున్నామని, ప్రతి బాలింతలకు కేసీఆర్ కిట్టులను అందజేస్తున్నాం. మహేశ్వరంలో కొత్త బిల్డింగ్ పనులు పూర్తి అయితే ఇంకా డెలివరీల సంఖ్య పెరుగుతుంది.
– రాజ్గోపాల్, సూపరింటెండెంట్
ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట: మంత్రి సబిత
పేదలకు సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. తెలంగాణలో ప్రతి పల్లెకు, ప్రతి బస్తీకి బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నామని, రూ.6 కోట్లతో మహేశ్వరానికి 30 పడకల ఆసుపత్రిని తీసుకొచ్చాము. కొత్త బిల్డింగ్ పనులు చివరి దశలో కొనసాగుతున్నాయని, మహేశ్వరంలో ఆక్సీజన్ ప్లాంటు ను ఏర్పాటు చేశాం. గతంలో సర్కారు దవాఖానకు వెళ్లాలంటే ప్రజలు భయపడేవారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు సర్కారు దవాఖానకు వెళుతున్నారు. అన్ని రకాలుగా సర్కారు దవాఖానలను ఆధునీకరించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధితో కృషి చేస్తుస్తున్నారు.