హైరాబాద్ : ఆసరా పింఛన్లు పేదలకు ప్రభుత్వం అందిస్తున్న భరోసా అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం బేగంపేట, గోషా మహల్లో లబ్ధిదారులకు నూతన పెన్షన్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..దేశంలో ఎక్కడా లేని విధంగా వృద్ధులు, వితంతువులకు రూ.2016, వికలాంగులకు రూ.3016 అందిస్తున్న ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే అని మంత్రి పేర్కొన్నారు.
పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లు భారం కావొద్దని సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు అమలు చేస్తున్నారని ఆయన తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలవుతుంటే ప్రతిపక్షాలు కండ్లు ఉన్న కబోదులుగా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు.
ప్రతి పక్షాలు ఇకనైనా తమ పద్ధతి మార్చుకొని మంచి పనులను చేస్తున్న ప్రభుత్వానికి సహకరించాలని హితవు పలికారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.