మన్సూరాబాద్, ఫిబ్రవరి 1: తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యం ఇస్తుందని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తెలిపారు. రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాగోల్లోని స్కంద బ్యాడ్మింటన్ అకాడమీలో జిల్లా స్పోర్ట్స్ అథారిటీ సమన్వయంతో నిర్వహించిన తెలంగాణ స్టేట్ బ్యాడ్మింటన్ ఓపెన్ టోర్నమెంట్ బాలురు, బాలికల అండర్ 13, 15 ముగింపు కార్యక్రమానికి ఉప్పల శ్రీనివాస్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యమివ్వడమే కాకుండా క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం కల్పిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కారెడ్ల శ్రీనివాస రావు, కోశాధికారి కె.పాణిరావు, కన్వీనర్ సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.