పలుచోట్ల జాతీయ జెండా ఆవిష్కరణ
పాల్గొన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పొరేటర్లు,
పలు సంఘాలు, ప్రజలు
దుండిగల్/కుత్బుల్లాపూర్/జీడిమెట్ల,జూన్2: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో గురువారం తెలంగాణ అవతరణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భం గా ప్రభుత్వ,ప్రైవేట్ కార్యాలయాలతో పాటు సంక్షేమ సంఘాల నేతలు వేడుకల్లో పాల్గొన్నారు.పలు చోట్ల జాతీయజెండాతో పాటు టీఆర్ఎస్ పతాకాన్ని నేతలు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో 14 ఏండ్ల పాటు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం నేడు అన్ని రంగాల్లో ముందుకెళ్తూ బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుంటుందన్నారు.