మేడ్చల్, జూన్18 (నమస్తే తెలంగాణ) : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ధూలపల్లిలోని తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీలో ఆహ్లాదకర వాతావరణం కనువిందు చేస్తున్నది. అటవీ ప్రాంతంలో ఉన్న రాష్ట్ర అకాడమీ కార్యాలయం సమీపంలో ఎక్కడ చూసిన పచ్చందాలు, వివిధ రకాల అడవి జంతువుల రూపాలు, రాతితో చెక్కిన శిల్పాలను ఏర్పాటు చేశారు.
సుమారు 7 వందల ఎకరాలలో వివిధ రకాల అడవి జాతీ చెట్లతో దట్టమైన అటవీ ప్రాంతంలా మారింది. అటవీ శాఖలో ఉద్యోగాలు పొందిన వివిధ ర్యాంకుల వారికి ఇక్కడ శిక్షణ ఇస్తారు. ఇందులో బీట్అధికారులు, సెక్షన్ అధికారులు, రేంజ్ అధికారులు శిక్షణ పొందుతారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 8603 హెక్టార్ల విస్తీర్ణంలో 37 ఫారెస్ట్ బ్లాకులు ఉన్నాయి. ఫారెస్ట్ బ్లాక్లో మరో 4 అర్బన్ పార్క్లు ఏర్పాటుకు అటవీ శాఖ చర్యలు చేపట్టింది.