రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం ఇస్తే పేదలకు మేలు జరుగుతుంది. ఎంతో మంది దొడ్డు బియ్యం ఇష్టం లేకు న్నా తింటున్నారు. కొంత మంది దొడ్డు బియ్యం తినలేక అమ్ముకుంటున్నారు. ఐదుగురు ఉన్న ఒక్కో కుటుంబం సన్న బియ్యం కోసం నెలకు ఎంత లేదన్నా రూ.1000 నుంచి రూ.1500 వరకు ఖర్చు చేస్తున్నది. సన్నబియ్యం ఇస్తే కొంత ఆర్థిక భారం తగ్గుతుంది. సీఎం కేసీఆర్ ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకుంటారు.
– మాలె స్వామి, ప్రైవేట్ ఉద్యోగి, మేడ్చల్
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): నిరుపేదకు బియ్యం గోస తీరనున్నది. సీఎం కేసీఆర్ తాజా ఎన్నికల మ్యానిఫెస్టోలో భాగంగా రేషన్ కార్డుపై సన్న బియ్యమే పంపిణీ చేయనున్నట్లు ప్రకటించడంతో పేదల కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. కేవలం హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల పరిధుల్లోనే ఒకటీ, రెండు కాదు… ఏకంగా 11.63 లక్షల కుటుంబాల్లోని నలభై లక్షల మందికి పైగా ప్రయోజనం చేకూరనున్నది.
హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల పరిధిలో ప్రతి నెలా సుమారు 25వేల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం సరఫరా చేస్తున్నారు. గతంలో ఒక కుటుంబ సభ్యునికి నాలుగు కిలోల చొప్పున ఒక్కో కుటుంబానికి గరిష్ఠంగా 16 కిలోల బియ్యం మాత్రమే పంపిణీ అయ్యేది. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కో సభ్యునికి ఆరు కిలోల చొప్పున కుటుంబంలో ఎంత మంది ఉంటే అంతమంది అంటే పరిమితి అనేది లేకుండా పంపిణీ జరుగుతున్నది. ఒక కుటుంబంలో పది మంది ఉంటే ఆరు కిలోల చొప్పున అరవై కిలోల బియ్యం కూడా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా పరిధిలో 6,39,669 రేషన్ కార్డులు ఉండగా… నెలకు 14,225 మెట్రిక్ టన్నుల ధాన్యం పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 5,24,153 రేషన్ కార్డులు ఉండగా… నెలకు 10,650.124 మెట్రిక్ టన్నుల ధాన్యం పంపిణీ చేస్తున్నారు. ఇలా రెండు జిల్లాల పరిధిలో 11.63 లక్షల రేషన్కార్డులపై నెలకు సుమారు 25వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. అంటే ఒక్కో కుటుంబ సభ్యునికి ఆరు కిలోల చొప్పున దాదాపు 41.67 లక్షల మందికి బియ్యాన్ని అందిస్తున్నారు.
సీఎం కేసీఆర్ తాజాగా వెల్లడించిన ఎన్నికల మ్యానిఫెస్టోలో రేషన్కార్డులపై (ఫుడ్ సెక్యూరిటీ కార్డులు) సన్నబియ్యం సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. దీని వల్ల రెండు జిల్లాల పరిధిలో ఏకంగా పదకొండు లక్షల కుటుంబాలకు పైగా ప్రయోజనం చేకూరుతుంది. ప్రస్తుతం పంపిణీ అవుతున్న సుమారు 25వేల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం రానుండటంతో లక్షలాది కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. ఇకపై బయటి మార్కెట్లో సన్న బియ్యం కొనుగోలు బాధ తప్పనుందని కార్డుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పేద, మధ్యతరగతి కుటుంబాలకు అనుకూలంగా సీఎం కేసీఆర్ తెల్ల రేషన్కార్డు ఉన్న ప్రతిఒక్కరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించడం హర్షణీయం. ఏ ప్రభుత్వాలు పేదలను ఇలా ఆదుకోలేదు. సీఎం కేసీఆర్ పేదల పాలిట దేవుడు అని నిరూపించుకున్నారు.
– అబ్దుల్ హమీద్, సఫ్థార్నగర్
రేషన్ కార్డులు ఉన్న వారు ఇప్పటి వరకు దొడ్డు బియ్యం తింటున్నారు. సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోలో రేషన్ కార్డుపై సన్నబియ్యం ఇస్తామని చెప్పడం సంతోషకర పరిణామం. పేదల ఇండ్లలో సన్నబియ్యంతో అందరూ కడుపునిండా భోజనాలు చేస్తారు. సన్న బియ్యం పంపిణీ జరిగితే సీఎం కేసీఆర్కు ప్రజలు రుణపడి ఉంటారు.
– విజయ్, గుడిమల్కాపూర్
పేద ప్రజలు సంతోషంగా ఉండేందుకు ఆహార భద్రత పథకంలో సన్నబియ్యం అంజేస్తామని సీఎం కేసీఆర్ సార్ ప్రకటించడం చాలా సంతోషం. సన్నబియ్యం ఇస్తే పేదలకు ఆర్థిక ఇబ్బందులు తప్పుతాయి. సన్నబియ్యం ఇస్తే అందరూ సంతోషంగా తీసుకుంటారు.
– సి.అలివేలు, యూసుఫ్గూడ
కుటుంబంలో ఎంతమంది సభ్యులుంటే అంతమందికి 6 కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నారు. ఎన్నికల్లో గెలిస్తే రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇస్తామని చెప్పడం చాలా సంతోషం. ఎవరు ఏ పని చేసినా కడుపు నిండా భోజనం చేయడానికే. రేషన్ కార్డుమీద సీఎం కేసీఆర్ సారు అందరికీ సన్న బియ్యం అందజేస్తామని ప్రకటించడం సంతోషాన్ని ఇస్తున్నది.
– శాంతమ్మ, ఎల్ఎన్నగర్
చిన్న ఉపాధి పనులతో కుటుంబాలను పోషించుకునే పేదలకు పెద్దలు తినే సన్నబియ్యాన్ని ఇస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించడం సంతోషకరమైన విషయం. ధరలు ప్రస్తుతానికి రేషన్ దుకాణాల్లో ఇస్తున్న బియ్యానికి బదులు నాణ్యమైన సన్నబియ్యాన్ని అందించి పేద ప్రజల కడుపు నింపే ఆలోచన గొప్పది. సర్కారు పాఠశాలలో పేద పిల్లలకు ఇప్పటికే సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్న సీఎం కేసీఆర్.. ఆ అదృష్టాన్ని పేదలకు కల్పిస్తామడం హర్షించే విషయం.
– రవికుమార్, వివేకానందనగర్
ప్రజల కష్టా సుఖాలు తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్ సార్. రేషన్ కార్డుపై దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం పంపిణీ చేయడం ఆర్థికంగా లాభం చేకురుతుంది. దొడ్డు బియ్యం తినేందుకు ఇబ్బందిగా ఉంటున్నది. సన్న బియ్యం పంపిణీ వల్ల ఇంటిల్లిపాది కి సంపూర్ణ ఆరోగ్యం చేకురుతుంది. కారు గుర్తుకు ఓటు వేసి మూడో సారి బీఆర్ఎస్ను గెలిపించుకుంటాం.
– ఎం.పద్మ, భగత్ సింగ్ నగర్, చింతల్
సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోలో రానున్న రోజుల్లో రేషన్షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించడం సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు దొడ్డు బియ్యం పిల్లలు తినేందుకు అయిష్టపడేవారు.వారి కోసం ప్రత్యేకంగా సన్న బియ్యం కొనుగోలు చేసేవాళ్లం. మేం కొనుగులు చేయకుండా నేరుగా ప్రభుత్వమే సన్నబియ్యం ఇచ్చేందుకు ముందుకు రావడం శుభ పరిణామం.
– రవీందర్రెడ్డి, వివేకానందనగర్
ధనికులతో సమానంగా పేద ప్రజలు ఉండేలా అన్ని రకాల అవకాశాలు కల్పిస్తున్న దేవుడు ముఖ్యమంత్రి కేసీఆర్. పేదోళ్లకు కూడా సన్న బియ్యం ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం ఎంతో సంతోషం కలిగింది. మళ్లీ ఆయన అధికారంలోకి వస్తే సన్నబియ్యం అయినా, పింఛన్ల పెంపైనా సాధ్యమవుతుంది.
– పందిరి శశికళ, ఎన్ఎఫ్సీనగర్
రేషన్పాపుల్లో తెల్లకార్డుపై సన్నబియ్యం పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ సార్ ప్రకటించడం సంతోషంగా ఉన్నది. పేదల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్.. పేదల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు.
– చంద్రకళ, ఖాజగూడ
సన్నబియ్యం ఇస్తామని సీఎం సార్ చెప్పడం సంతోషంగా ఉన్నది. దొడ్డు బియ్యం అన్నం తినాలంటే ఇబ్బందిగా ఉన్నది. ఆకలి బాధ తట్టుకోలేక నాలుగు ముద్దలు తింటున్నాం. సీఎం కేసీఆర్ రాకముందు ఆ దొడ్డు బియ్యం కూడా సరిపడా ఇచ్చేవారు కాదు. అలాంటిది కేసీఆర్ సార్ సన్నబియ్యం ఇస్తామంటున్నారు. మళ్లీ ఆయనే సీఎం కావాలి.
– నాంపల్లి లక్ష్మి, నామాలగుండు
బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోలో రేషన్ కార్డు ఉన్న వారందరికీ రాబోయే రోజుల్లో సన్నబియ్యం ఇస్తామని ప్రకటించడం సంతోషంగా ఉన్నది. పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుంది. ప్రతి కుటుంబానికి 5 లక్షల బీమా పథకాన్ని ప్రకటించి..ప్రజలకు మరింత భరోసా కల్పించారు. కేసీఆర్ సార్ మూడోసారి సీఎం కావడం ఖాయం.
– కె. అశోక్ ముదిరాజ్, రెజిమెంటల్బజార్
కేసీఆర్ సార్కు రుణపడి ఉంటాం. దొడ్డు బియ్యంతో వండిన అన్నం పిల్లలు తినడానికి ఇబ్బంది పడేవారు. కానీ తినక తప్పని పరిస్థితులు. ఇప్పుడు సన్న బియ్యం పంపిణీ రాబోతుండటంతో మాకు చాలా సంతోషంగా ఉంది. రేషన్ కార్డుపై సన్నబియ్యం పంపిణీ అనేది గొప్ప విషయం. పండుగలు వచ్చినప్పుడు సన్న బియ్యం కొనుగోలు చేసి ఆ రోజు వంట చేసుకునే వాళ్లం. సన్న బియ్యం రాబోతుండటంతో అదృష్టంగా భావిస్తున్నాం.
– భాగ్యలక్ష్మి, అన్నానగర్
వృద్ధాప్యంలో ఉన్న వారికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆసరా పింఛన్లను అందించి పెద్ద భరోసా కల్పిస్తున్నది. తల్లిదండ్రులను కొడుకులు పట్టించుకోవడం లేదు. ఆ బాధలను గుర్తించిన సీఎం కేసీఆర్ సార్ ఇంటికి పెద్ద కొడుకులాగా నెల నెలా ఆసరా పింఛన్లు ఇస్తున్నారు. కేసీఆర్ సార్ ఇచ్చే పింఛన్ డబ్బులతో మా ఖర్చులను మేమే తీర్చుకుంటున్నాం. మళ్లీ పింఛన్ డబ్బులను పెంచుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. వృద్ధాప్య పింఛన్లతో ఎంతోమంది కష్టాలు తీరుతున్నాయి. ఎవరినీ ఖర్చుల కోసం డబ్బులు ఇవ్వమని అడిగే పనిలేదు.
– ఆకారం అనసూయ హరిజన బస్తీ, మాదన్నపేట