బంజారాహిల్స్,డిసెంబర్ 11: మారుమూల ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో కూడా మానసిక ఆరోగ్య సేవలు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలంగాణ డీఎంఈ డైరెక్టర్ డాక్టర్ రమేశ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ(ఐపీఎస్) తెలంగాణ శాఖ, అపోలో మెడికల్ సైన్సెస్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైకియాట్రీ సంయుక్త ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్లోని అపోలో ఆస్పత్రిలో సోమవారం 9వ మధ్యంతర సదస్సు నిర్వహించారు.
ఈ సదస్సును ప్రారంభించిన డా.రమేశ్రెడ్డి మాట్లాడుతూ.. మనోరోగ చికిత్స సేవలను ప్రతి వైద్య కళాశాలలో తప్పనిసరి చేశామని పేర్కొన్నారు. ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, వారిలోని ఒత్తిడిని తగ్గించి సరైన మార్గంలో పెట్టాలంటే మనోరోగ చికిత్స పరిధి మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మెంటల్ హెల్త్ అథారిటీ సీఈవో డా.ఉమాశంకర్, ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ ప్రధాన కార్యదర్శి డా. అరవింద బ్రహ్మ, డీఎస్బీ వైస్ ప్రెసిడెంట్ డా. అశోక్ అలీం చందానీ, డా. నేహా మహేంద్ర గాలా, నరేశ్ వడ్లమాని తదితరులు పాల్గొన్నారు.