సిటీబ్యూరో, నవంబరు 23 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 30న జరిగే పోలింగ్కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తరలించేందుకు చర్యలు చేపట్టారు. అయితే ఆయా నియోజకవర్గాలకు సంబంధించి బ్యాలెట్ పేపర్లను ముద్రించి గురువారం వాటిని ఈవీఎంలపై బ్యాలెట్ పేపర్ అంటించడం, ప్రోగ్రామింగ్ చేశారు. ఈ ప్రక్రియను శుక్రవారంతో ముగించనున్నారు. ఇలా సిద్ధమైన ఈవీఎంలను రాజకీయ పార్టీల సమక్షంలో ఓ సారి నమూనా పోలింగ్ నిర్వహిస్తారు.
పోలింగ్ ముందు రోజున అన్ని ఈవీఎంలను నియోజకవర్గాల వారీగా తారుమారు (ర్యాండమైజేషన్) చేసి, ఆ తర్వాత ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించనున్నారు. అయితే, ఒక్కో ఈవీఎంలో నోటాతో కలిసి 16 మంది అభ్యర్థులను నమోదు చేసేందుకు అవకాశం ఉంది. 15 మంది అభ్యర్థుల కన్నా తక్కువ మంది బరిలో ఉంటే ఒక ఈవీఎం, నోటాతో కలిసి 16 మంది కన్నా అధికంగా ఉంటే రెండు ఈవీఎంలు అవసరమవుతాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో మూడు ఈవీఎంలు అవసరం పడగా.. మిగతా నియోజకవర్గాల్లో ఒకటి నుంచి రెండు ఈవీఎంలు అవసరం ఉంటాయి.