బాలానగర్, మే 25 : రోడ్డు ప్రమాదంలో ఓ డిగ్రీ విద్యార్థి చనిపోయాడు. బాలానగర్ సీఐ ఎండీ వహీదుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. నాగార్జుననగర్లో నివాసముండే సయ్యద్ ఆరీఫ్ (19) కూకట్పల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్నాడు.
బుధవారం బాలానగర్ ఫ్లైఓవర్పై బైక్పై వెళ్తుండగా, మరో వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వైద్యశాలలో చికిత్స అందిస్తున్న క్రమంలో చనిపోయాడు.