హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రో రైలుకు మరోసారి సాంకేతిక సమస్య ఏర్పడింది. అమీర్పేట – రాయదుర్గం మార్గంలో అర గంట పాటు మెట్రో రైళ్లు నిలిచిపోయాయి. దీంతో ఒకే మార్గంలో రైళ్లు రాకపోకలు కొనసాగించాయి. ఒకే మార్గంలో రాకపోకల వల్ల మెట్రో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ క్రమంలో అమీర్పేట మెట్రో స్టేషన్లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంత మంది ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించారు. గతంలో కూడా పలు సందర్భాల్లో మెట్రో రైళ్లలో సాంకేతిక సమస్యలు ఏర్పడిన విషయం తెలిసిందే.