హైదరాబాద్ : మలక్పేట పరిధిలోని ముసారాంబాగ్ స్టేషన్లో మెట్రో రైలు ఆగిపోయింది. సాంకేతిక లోపంతో రైలు ఆగిపోయినట్లు మెట్రో రైలు అధికారులు తెలిపారు. మరమ్మతులు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ఒక్క రైలు ఆగిపోయిన కారణంగా.. మిగతా రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.