శంషాబాద్ రూరల్, ఏప్రిల్ 6 : శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఆదివారం రాయాపూర్ వెళ్లాల్సిన వీటీ-రీమ్ చార్టర్ విమాంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో విమానం టాక్సీవేపై నిలిచిపోయింది. సమస్యను గుర్తించిన ఎయిర్సైడ్ బృందం వెంటనే స్పందించి విమానాన్ని సురక్షింతంగా తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్టులోనే ల్యాండింగ్ చేశారని ఎయిర్పోర్టు ప్రతినిధులు సోమవారం మీడియాకు తెలిపారు.
దీంతో ఒక విమానం గో- అరౌండ్ చేయాల్సి వచ్చినప్పటికి ఎలింటి ఇబ్బందులు లేకుండా విమానాశ్రయ కార్యకలాపాలు సాధారణంగా కొనసాగించిన్నట్లు వివరించారు. ఎయిర్పోర్టులో ఎలాంటి అంతరాయం లేకుండా విమానాలు రాకపోకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.