హైదరాబాద్ : ఫ్లాట్కు ఓనర్షిప్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు లంచం తీసుకుంటుండగా జీహెచ్ఎంసీ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ను(Tax inspector )ఏసీబీ(ACB) అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే రాధాకృష్ణ అనే ట్యాక్స్ ఇన్స్పెక్టర్ ఓ వ్యక్తికి ఓనర్షిప్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు రూ. 8వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో చేసేదిలేక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు సోమవారం లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.