తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న తలసాని.. శనివారం తెల్లవారుజామున సుప్రభాత సేవ సమయంలో స్వామివారిని దర్శికుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం వారికి రంగనాయకుల మంటపంలో ఆలయ పండితులు వారికి వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు. అధికారులు తీర్థప్రసాదాలు అందించారు.