Talasani Srinivas Yadav | హైదరాబాద్ : భవిష్యత్ తరాలకు ఇవ్వాల్సింది ఆస్తులు కాదు.. మంచి వాతావరణం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మారేడ్పల్లిలోని పార్కులో మంత్రి తలసాని మొక్కలు నాటారు. పద్మారావు నగర్లోని చిదానందం కాలనీలో దశాబ్ది పార్కును మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ఈ ఒక్క రోజే నగరంలో 60 దశాబ్ది పార్కులను ప్రారంభించుకున్నామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి ప్రత్యేక పర్యవేక్షణ, కృషితో చేపట్టిన హరితహారంతో రాష్ట్రంలో పచ్చదనం పెరిగిందన్నారు. పల్లె ప్రకృతి వనాలు, పట్టణాలలో పార్కుల నిర్మాణం, రహదారుల వెంట మొక్కల పెంపకం చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు మొక్కలను నాటి పరిరక్షించాలి అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు.