Talasani Srinivas Yadav | హైదరాబాద్ : సనత్ నగర్ నియోజకవర్గంలో అనేక సమస్యలను పరిష్కరించాను.. అభివృద్ధి చేశాను.. తనకే ఓటు వేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అభ్యర్థించారు. బేగంపేట, అమీర్పేట డివిజన్లలో మంత్రి తలసాని ఇవాళ ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సనత్ నగర్ నియోజకవర్గంలో 50 సంవత్సరాలలో జరగని అభివృద్ధిని తొమ్మిదిన్నర సంవత్సరాలలో చేశామని తెలిపారు. తన కంటే ముందు గెలిచిన వారు ముఖ్యమంత్రి, కేంద్రమంత్రిగా ఉండి కూడా ఎలాంటి అభివృద్ధి చేయలేదని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో రూ. 1400 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశానని స్పష్టం చేశారు. మరోసారి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రజలకు హామీ ఇచ్చారు.