బేగంపేట్ / బన్సీలాల్పేట్, నవంబర్ 10 : మైనారిటీ ప్రజల సంక్షేమంతో పాటు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి తలసాని సాయికిరణ్యాదవ్ అన్నారు. బేగంపేట్తో పాటు సనత్నగర్ నియోజకవర్గంలోని మసీదులు దర్గాల వద్ద శుక్రవారం మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్కు మద్దతు ఇచ్చి ఓటు వేయాలని ముస్లిమ్లను కలిసి అభ్యర్థించారు. బేగంపేట్ డివిజన్ మైనార్టీ సీనియర్ నాయకులు బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ డైరక్టర్ మహ్మద్ అఖీల్ హమ్మద్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారం తలసాని సాయికిరణ్యాదవ్ పాల్గొన్నారు.
ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ… నిరుపేద మైనారిటీలకు ఆర్థిక సహాయం అందించేందుకు రుణాలు ఇచ్చి ప్రోత్సాహం ఇవ్వడం, రంజాన్ పండగకు పేదలకు కానుకలను ఇవ్వడం, ఆడపిల్ల వివాహానికి శాదీ ముబారక్ ద్వారా లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు. అలాంటి నాయకుడు ప్రజలకు అవసరం అన్నారు. సీఎం కేసీఆర్కు మైనార్టీలు రుణపడి ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో బేగంపేట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ నాయకులు అక్బర్. శ్రీహరి, శ్రీనివాస్గౌడ్, శేఖర్ ముదిరాజ్, జావీద్ పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ తెలంగాణలో మైనారిటీ ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారని బీఆర్ఎస్ పద్మారావునగర్ ఇన్చార్జి జీ పవన్కుమార్గౌడ్ అన్నారు. పద్మారావునగర్లోని మసీదు వద్ద శుక్రవారం ఆయన మంత్రి తలసానికి మద్దతు ఇవ్వాలని ముస్లిమ్లను కలిసి అభ్యర్థించారు. ఉర్దూలో ప్రచురించిన కరపత్రాలను ఆయన వారికి అందజేశారు. హైద్రాబాద్ నగరంలో శాంతి భద్రతల పరిరక్షణ చర్యలు తీసుకున్నారని, గత పదేండ్లలో కర్ఫ్యూ భయం లేకుండా అన్ని ప్రాంతాలను అద్భుతమైన అభివృద్ధి చేశారని ఆయన అన్నారు.
నిరుపేద మైనారిటీలకు ఆర్థిక సహాయం అందించేందుకు రుణాలు ఇచ్చి ప్రోత్సాహం ఇవ్వడం, రంజాన్ పండగకు పేదలకు కానుకలను ఇవ్వడం, ఆడపిల్ల వివాహానికి శాదీ ముబారక్ ద్వారా లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ ఒక్కరేనని తెలిపారు. సనత్నగర్ నియోజకవర్గంలో ఎల్లప్పుడు ముస్లిమ్లకు అందుబాటులో ఉంటూ ఎలాంటి సమస్య వచ్చినా తక్షణం స్పందించే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను రాబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. బీఆర్ఎస్ మైనారిటీ విభాగం నాయకులు షేక్ షరీఫ్, మాజిద్ షరీఫ్ శాహెద్, దస్తగీర్ పాషా, మహ్మద్ గౌస్, ఎంఎ.కరీమ్, సురేశ్, మహేందర్ గౌడ్, హరిచారి, యాదగిరి యాదవ్, రవి పాల్గొన్నారు.