అంబర్పేట, ఫిబ్రవరి 6 : కాలనీలో ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. సోమవారం నల్లకుంట డివిజన్లోని ఇస్తరాకుల గల్లీ, పాత రామాలయం, అపార్ట్మెంట్ ప్రాంతాల్లో కార్పొరేటర్ వై.అమృతతో కలిసి ఎమ్మెల్యే పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు పలు సమస్యలను వారి దృష్టికి తీసుకొచ్చారు.
ఎమ్మెల్యే అక్కడి నుంచే ఆయా విభాగాల అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు ఇచ్చి సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలిపారు. ఇంకా ఏవైనా సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని వారికి సూచించారు.