సిటీబ్యూరో, జనవరి 20 (నమస్తే తెలంగాణ) : స్టేడియం స్థలాన్నే కాజేయాలని చూసిన అక్రమార్కుల కుట్రను భగ్నం చేసింది బల్దియా. కాప్రా సర్వే నంబర్ 199/1లో 12 గుంటల ప్రభుత్వ స్థలాన్ని మినీ స్టేడియం నిర్మాణానికి అప్పగించారు. ఈ స్థలంలో స్థానికులు కొందరు 15 సింగిల్ రూమ్ ఇండ్లను నిర్మించారు.
జీహెచ్ఎంసీ టౌన్ప్లానింగ్ విభాగానికి ఫిర్యాదులు అందడంతో రంగంలో దిగిన ఎల్బీనగర్ జోన్ సీపీ ప్రసాద్రావు నేతృత్వంలో ఏసీపీ గిరిరాజ్.. స్థానిక పోలీసుల సాయంతో ఆక్రమణలను నేలమట్టం చేశారు. భవిష్యత్లో కబ్జా కాకుండా స్థలం చుట్టూ రక్షణ చర్యలు చేపట్టి బోర్డును పాతారు. అక్రమార్కులపై స్థానిక జవహర్నగర్ పోలీస్స్టేషన్లో బల్దియా ఫిర్యాదు చేసింది.