మాదాపూర్: మాదాపూర్ సున్నం చెరువు పరిసర ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలను హైడ్రా అధికారులు ఖాళీ చేయాలంటూ నోటీసులను ఇవ్వడంతో పాటు సర్వే చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ.. సోమవారం ధర్నాకు దిగారు. దీంతో మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ నాయకులు కార్తిక్ రాయల పార్టీ నాయకులు, సున్నం చెరువు బాధితులతో కలిసి ధర్నాకు సంఘీభావం తెలిపి బాధితులతో కలిసి అక్రమ సర్వేను ఆపండి… ప్రజల హక్కులను కాపాడండి అంటూ నినాదాలు చేశారు.
సున్నం చెరువు నుంచి బాధితులతో కలిసి 100 ఫీట్ రోడ్డు వరకు ర్యాలీ చేశారు. హైడ్రా డౌన్ డౌన్, వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తూ.. సున్నం చెరువు పూడిక తీతను అడ్డుకున్నారు. దీంతో బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొని హైడ్రాకు వ్యతిరేకంగా ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ నాయకులు కార్తిక్ రాయల మాట్లాడుతూ… సున్నం చెరువు బాధితులను హైడ్రా అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు.