Hyderabad | హైదరాబాద్ : కిందిస్థాయి గాలులు వాయువ్య, పడమర దిశ నుంచి తెలంగాణ వైపునకు వీస్తుండడంతో గ్రేటర్ వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. ఈ వేసవి కాలంలో శుక్రవారం రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 41.0 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 28.4డిగ్రీలు, గాలిలో తేమ 21శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. రాగల మరో మూడు రోజులు హైదరాబాద్ నగరంలో ఉష్ణోగ్రతలు 42 – 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల మధ్య నమోదయ్యే అవకాశాలున్నట్లు అధికారులు హెచ్చరికలు జారీచేశారు.