సుల్తాన్బజార్ ప్రసూతి దవాఖానలో
పకడ్బందీగా పారిశుధ్యం పనులు
చెత్త వేసేందుకు ప్రత్యేక డస్ట్బిన్లు ఏర్పాటు
నిరంతరం అధికారుల పర్యవేక్షణ
సుల్తాన్బజార్,ఏప్రిల్ 4: ఇటీవల వరంగల్ ఎంజీఎం దవాఖానలో చోటు చేసుకున్న ఘటన పునరావృతం కాకుండా ఉండేందుకు గాను ఉస్మానియా,కింగ్కోఠి,కోఠి ఈఎన్టీ,సుల్తాన్బజార్ ప్రభుత్వ ప్రసూతి దవాఖానల ల్లో పారిశుధ్య చర్యలను మరింత పటిష్టం చేశారు. ఇందు కు గాను ఆయా దవాఖానల సూపరింటెండెంట్లకు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. దీంతో దవాఖానల్లో నిరంతరం పరిశుభ్రం గా ఉండేలా చర్యలను తీసుకోవడంలో ఆయా దవాఖానల పాలకవర్గం కసరత్తును ప్రారంభించింది.
ఇందులో భాగంగా సుల్తాన్బజార్ ప్రభుత్వ ప్రసూతి దవాఖానకు నిత్యం వందలమంది ఓపీకి వచ్చిపోతుండడంతో పాటు ఇన్పేషెంట్లుగా ఉన్న రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సూపరింటెండెంట్ డాక్టర్ రాజ్యలక్ష్మి ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది.దవాఖానలోని లేబర్ వార్డుతో పాటు ఆపరేషన్ థియేట ర్,వార్డులు, ఓపీ బ్లాక్తో పాటు పై కప్పులపై చెత్తాచెదాన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్ర పర్చడంలో ఏజిల్ సంస్థ కార్మికులు చర్యలను తీసుకుంటున్నారు.దవాఖానలో డ్రైనేజీలు పొంగి పొర్లితే సిబ్బందే స్వయంగా శుభ్రం చేస్తున్నారు.
చెత్త కోసం ప్రత్యేక డస్ట్బిన్లు ఏర్పాటు
పరిసర ప్రాంతాలు పరిశుభ్రం గా ఉంటేనే రోగాలు దరిచేరవు. దీన్ని దృష్టిలో ఉంచుకొని దవాఖానలో నిత్యం పారిశుధ్య చర్యలను చేపడుతున్నాం. దవాఖాన ల్లో ఎక్కడ పడితే అక్కడ రోగి సహాయకులు తిను బండారాలను వేయకుండా ప్రత్యే క డస్ట్బిన్లను ఏర్పాటుచేశాం. అందులోనే చెత్త వేయాలి.-డాక్టర్ కె. రాజ్యలక్ష్మి,దవాఖాన సూపరింటెండెంట్