మేడ్చల్, జూన్ 6(నమస్తే తెలంగాణ): ప్రముఖ పారిశ్రామికవేత్త సుదీక్ష గ్రూప్ కంపెనీల చైర్మన్ సుబ్రహ్మణ్య శర్మ, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిని ఆయన స్వగృహంలో సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు.
పలు దిగ్గజ కంపెనీలకు సేవలందించిన సుబ్రహ్మణ్య శర్మ తెలంగాణ రాష్ట్రంలో ఔషధ తయారీ పరిశ్రమ ఏర్పాటు చేసే విషయమై పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్తో పాటు మంత్రి మల్లారెడ్డిని కలిసి తన ప్రతిపాదనలను తెలియజేశారు.