మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య
మల్కాజిగిరి, ఏప్రిల్ 6: విద్యార్థులు మేధోశక్తిని పెంపొందించుకోవాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య అన్నారు. బుధవారం అల్వాల్ సర్కిల్, వెంకటాపురంలోని మహాబోధి స్కూల్లో జరిగిన ప్రజా గాయకుడు గద్దర్ జన్మదిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గద్దర్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి.. స్కూల్ ఆవరణలోని గద్దర్ కుమారుడు చంద్రకిరణ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి, మొక్కలు నాటారు.
జస్టిస్ చంద్రయ్య మాట్లాడుతూ.. సామాజిక న్యాయం కోసం పోరాటాలు నిరంతరం జరుగుతున్నాయని అన్నారు. గద్దర్ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం కోసం పోరాడారని అన్నారు. విద్యార్థి దశనుంచే గద్దర్ ఉస్మానియా యూని వర్సిటీలో పోరాటాలు చేశారని, అప్పటి నుంచే ఆయనతో తనకు సోదర ప్రేమ ఉందని అన్నారు. ప్రజలకు రాజ్యాం గం కల్పించిన హక్కులను కాపాడుకోవాలని అన్నారు. కార్యక్రమంలో వెన్నెల, వెంకట్రెడ్డి, జ్ఞానేశ్వర్, సీఎల్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.