మాదాపూర్, జనవరి 4: ఉరి వేసుకొని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకున్నది. ఎస్సై మాల్యానాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. సిద్ధిక్నగర్ రోడ్డు నంబర్ 5లో నివాసం ఉంటున్న ఎండీ జాకీర్ ఉద్ధీన్ (22) విద్యను అభ్యసిస్తున్నాడు. ఈ నెల 4వ తేదీన సాయంత్రం 5:30 గంటల సమయంలో తాను నివాసం ఉంటున్న రూంలో ఉరివేసుకున్నాడు.
అన్న ఫయాజ్ ఉద్ధీన్ స్విగ్గిలో డెలివరీ బాయ్గా పని చేస్తున్నాడు. విధులు ముగించుకొని ఇంటికి తిరిగి రాగ జాకీర్ ఉరికి వేలాడుతూ కనిపించాడు. మృతుడి అన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ విఫలం కావడంతోనే ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.