ముషీరాబాద్, జనవరి 4: విద్యానగర్, వీఎస్టీ మార్గాల్లో ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని డిప్యూటీ కమిషనర్(ట్రాఫిక్-2) పి. కరుణాకర్ అధికారులకు సూచించారు. వాహనాల మళ్లింపునకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలించిన వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బుధవారం ఆయన నల్లకుంట ట్రాఫిక్ పోలీసు స్టేషన్ పరిధిలోని రాంనగర్ టీ జంక్షన్, విద్యానగర్ స్పెన్సర్స్, హింది మహావిద్యాలయం, విద్యానగర్ చౌరస్తాలను అధికారులు, స్థానికులతో కలిసి ట్రాఫిక్ తీరును పరిశీలించారు. పలువురు స్థానికులను అడిగి ట్రాఫిక్ సమస్యల తీరును వాకబు చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ హిందీమహా విద్యాలయం-వీఎస్టీ మార్గంలో నాలాపై వంతెన నిర్మాణ పనులు పూర్తయిన నేపథ్యంలో వాహనాల మళ్లింపునకు అవసరమైన చర్య లు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకోసం జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి సమన్వయంతో ముందు కు సాగాలని అన్నారు. విద్యానగర్ జంక్షన్ సమీపంలో ఉన్న బస్సు స్టాప్లను మార్చాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈస్టు జోన్ ట్రాఫిక్ ఎసీపీ ఎస్ సంపత్కుమార్, నల్లకుంట ట్రాఫిక్ పోలీసుస్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం.రామకృష్ణ, జీహెచ్ఎంసీ డిప్యూటీ ఈఈ సన్నీ, అడిక్మెట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కె. సురేందర్ పాల్గొన్నారు.