అల్లాపూర్,ఫిబ్రవరి13: అల్లాపూర్ డివిజన్ పరిధిలోని హరినగర్లో ఎనిమిదేండ్ల బాలుడిపై వీధికుక్కలు దాడి చేశాయి. స్థానికుల కథనం ప్రకా రం..శుక్రవారం హరినగర్ బస్తీవాసిలో ఎనిమిది సంత్సరాల సుక్రిత్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చి, వీధిలో ఆడుకుంటుండగా కుక్కలు వెంటపడ్డాయి. భయంతో ఇంట్లోకి పరుగెత్తుతుండగా బాలుడిని కుక్కలు వెంబడించి కరిచాయి.
దీంతో బాలుడు పెద్దగా కేకలు వేయడంతో స్పందించిన స్థానికులు కుక్కలను తరిమికొట్టారు. తీవ్రగాయాల పాలైన బాలుడిని చికిత్స నిమిత్తం నాయరాణగూడ ఆసుపత్రికి తరలించారు.వరుసగా కుక్కల దాడులు జరుగుతు న్న…జీహెచ్ఎంసీ అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.