సిటీబ్యూరో, మార్చి 25(నమస్తే తెలంగాణ): తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే ఉద్యోగులకు సంబంధించి అనేక సమస్యలను పరిషరించినట్టు రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఆదర్శనగర్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వాటర్ వర్స్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా టీఆర్ఎస్ అనుబంధ సంఘం నుంచి బరిలో ఉన్న రాంబాబు యాదవ్తో కలిసి మాట్లాడారు. వాటర్ వర్స్ బోర్డ్లోని ఉద్యోగుల సమస్యలపై పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉన్న రాంబాబు యాదవ్ను శనివారం జరిగే ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని తలసాని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జలమండలిలో అధికార టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘానికి చెందిన అభ్యర్థిని గెలిపించుకోవడం వలన ఉద్యోగుల సమస్యలు పరిషారం కావడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని ఉద్యోగులు గుర్తించాలని తలసాని చెప్పారు. గతంలో ఉద్యోగుల వైద్య పరమైన పరిరక్షణ కోసం రూ.2 కోట్ల కేటాయింపు ఉండగా, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చొరవతో రూ.7 కోట్లను పెంచినట్టు తలసాని చెప్పారు. కృష్ణా, గోదావరి జలాలను వినియోగించుకోవడం ద్వారా రానున్న 50 ఏండ్ల వరకు కూడా నీటి కొరత ఏర్పడకుండా చర్యలు చేపట్టినట్లు మంత్రి శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.