ఉప్పల్ జోన్ బృందం, ఏప్రిల్ 10 : ఉప్పల్ నియోజకవర్గం పరిధిలో ఆదివారం సీతారాముల కల్యాణ వేడుకలను వైభవంగా నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా పలు ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసి, కల్యాణం, పూజా కార్యక్రమాలు చేపట్టారు. రామాలయాల్లో ప్రత్యేకంగా అలంకరణలు చేపట్టారు. ఊరేగింపులు నిర్వహించి, భక్తులకు దర్శనంతోపాటు, అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఆయా ఆలయాల్లో జరిగిన వేడుకలకు ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు హాజరై పూజలు చేశారు. కల్యాణ మహోత్సవం సందర్భంగా కాలనీల్లో భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.
హబ్సిగూడ స్ట్రీట్ నం. 1 లోని రామాలయంలో జరిగిన ఉత్సవాల్లో ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, ఆలయ చైర్మన్ గాయం శ్రీధర్రెడ్డి, జనుంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, తదితర భక్తులు పాల్లొన్నారు.
ఉప్పల్ స్వరూప్నగర్ వేంకటేశ్వర ఆలయంలోని కల్యాణ మహోత్సవానికి హాజరైన భక్తులు