హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్ – నర్సాపూర్ రైల్వే స్టేషన్ల మధ్య రెండు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు బుధవారం వెల్లడించారు. ఈ నెల 13, 14 తేదీల్లో ప్రత్యేక రైళ్ల రాకపోకలు కొనసాగుతాయన్నారు. అలాగే నాందేడ్ – తిరుపతి స్టేషన్ల మధ్య ఈ నెల 15, 22, 16, 23 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయన్నారు. మిరాజ్ – పార్లీ వైజ్జనాథ్ స్టేషన్ల మధ్య రెండు డెమో ఎక్స్ప్రెస్ రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 15 నుంచి ఈ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయన్నారు.