సిటీబ్యూరో, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో వీధి కుకల నియంత్రణకు ఏర్పాటైన హైలెవల్ కమిటీ సూచించిన సిఫార్సులను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. హైలెవల్ కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యటించి కుకల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై రూపొందించిన 26 అంశాల తో కూడిన నివేదికను శనివారం నగర మేయర్ గద్వాల విజయలక్ష్మికి అందజేశారు. కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన పలు అంశాలను మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా హై లెవల్ కమిటీ సభ్యులు సీ.ఎన్.రెడ్డి, శ్రవణ్, రాజశేఖర్ రెడ్డి, సయ్యద్ సోహెల్ ఖాద్రీ, మీర్జా ముస్తఫా బేగ్, అడిషనల్ కమిషనర్ హెల్త్ శృతి ఓజా, వెటర్నరీ అధికారి అబ్దుల్ వకీల్, జాయింట్ కమిషనర్ శానిటేషన్ సంధ్య, హై లెవల్ కమిటీ కో-ఆర్డినేటర్ డా.జే.పీ విల్సన్ తదితరులు పాల్గొన్నారు.
26 అంశాలపై నివేదిక
కుకల నియంత్రణపై హైలెవల్ కమిటీ ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో జరుగుతున్న వీధి కుకల ఆపరేషన్స్ తదితర అంశాలపై సమగ్రంగా స్టడీ చేసి 26 అంశాలను జీహెచ్ఎంసీ కమిషనర్ పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతామని మేయర్ తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కుక కాటు నియంత్రణపై వెటర్నరీ, శానిటేషన్, హెల్త్ విభాగాలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని మేయర్కు సూచించారు. ప్రస్తుతం ఉన్న స్టెరిలైజేషన్ సంఖ్యను రోజువారీగా 300 నుంచి 400 వరకు పెంచేలా చర్యలు తీసుకోవాలని, కుకలను పట్టుకునేందుకు డాగ్ స్వాడ్ టీమ్లు రాత్రి వేళలో కూడా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని మేయర్ తెలిపారు.
మరిన్ని అంశాలు ఇవే..
అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలి
వీధి కుకల నియంత్రణకు వెటర్నరీ, హెల్త్, శానిటేషన్ సంయుక్తంగా చర్యలు తీసుకోవాలని అధికారులను మేయర్ ఆదేశించారు. నగరంలో జోన్ వారీగా ఉన్న హోటల్స్, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాల్స్ గార్బేజ్ను ఎప్పటికప్పుడు తొలగించేందుకు శానిటేషన్ జవాన్ గానీ, ఎస్ఎఫ్ఏకు బాధ్యత ఇవ్వాలని జాయింట్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు. సరిల్లో కుకలు ఎకవగా సంచరించే ప్రదేశాలను గుర్తించి వెటర్నరీ శాఖతో కలిసి క్షేత్రస్థాయిలో నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. వీధి కుకలను పట్టుకోవడానికి 30 సరిళ్లలో రెండు వాహనాల చొప్పున 60 వాహనాలను ఏర్పాటు చేయాలని మేయర్ అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీల్లో యాంటీ బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు జరిగేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నట్లు మేయర్ తెలిపారు. వీధి కుకలను పట్టుకునేందుకు డాగ్ స్వాడ్ బదులు స్టెరిలైజేషన్ స్వాడ్గా మార్చామని చెప్పారు. వెటర్నరీ శాఖలో ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తీసుకునేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. వీధి కుకల నియంత్రణకు ఎన్జీవోలు, ఏడబ్ల్యూఓ, వలంటీర్లు,యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్లు సహకారం అవసరం ఉంటుందని ఈ విషయంలో సహకరించాలని మేయర్ సూచించారు. కమిటీ నివేదిక ప్రకారంగా వచ్చే వారంలో హై లెవల్ కమిటీ సభ్యులతో పాటు అడిషనల్ కమిషనర్ శానిటేషన్ హెల్త్, వెటర్నరీ అధికారులతో పూర్తిస్థాయిలో సమీక్షించేందుకు సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సభ్యులకు వివరించారు.