TSRTC | హైదరాబాద్ : హైదరాబాద్లో ఈ నెల 11న (ఆదివారం) నిర్వహించనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు శుక్రవారం ఆర్టీసీ గ్రేటర్ జోన్ అధికారులు వెల్లడించారు. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలకు దాదాపు 50 వేలకు పైగా అభ్యర్థులు హాజరుకానున్నారు.
దీంతో అభ్యర్థులను వారి వారి పరీక్షా కేంద్రాలకు చేరవేసేందుకు నగరంలోని పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. ప్రత్యేక బస్సులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అందుబాటులో ఉంటాయన్నారు. బస్సుల రాకపోకల కోసం కోఠి, సికింద్రాబాద్ బస్టాండ్లలో రెండు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కోఠిలో 9959226160, సికింద్రాబాద్లో 9959226154 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు.