RTC Buses | హైదరాబాద్ : ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (ఆర్జీఐసీ స్టేడియం)లో గురువారం నిర్వహించే ఐపీఎల్ టీ20 మ్యాచ్లో భాగంగా కలకత్తా నైట్ రైడర్స్, సన్రైజర్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ నేపథ్యంలో క్రికెట్ లవర్స్ కోసం ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.
నగరంలోని దాదాపు 24 ప్రాంతాల నుంచి 60 బస్సులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ గ్రేటర్ జోన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ యాదగిరి తెలిపారు. అయితే సాయంత్రం 4.30 నుంచి రాత్రి 11.30 గంటల వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. క్రికెట్ ప్రేమికులు ఈ ప్రత్యేక బస్సుల సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరారు.