MMTS | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో అదనపు ఎంఎంటీఎస్ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం రైళ్లకు తోడుగా.. కొత్తగా 40 సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో 20 రైల్లు సికింద్రాబాద్ – మేడ్చల్ మధ్య పరుగులు పెట్టనుండగా.. మరో 20 ఫలక్నుమా – ఉందానగర్ మధ్య నడుపనున్నట్లు పేర్కొంది. కొత్తగా తీసుకువచ్చిన రైళ్లతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఎంఎంటీఎస్ రైళ్ల సంఖ్య 106కు చేరింది. వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకొని.. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా కొత్తగా సర్వీసులు తీసుకువచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి.