Hyderabad | బంజారాహిల్స్, ఆగస్టు 23: తలనొప్పిగా ఉంది.. అర్జెంట్గా ట్యాబ్లెట్ ఇవ్వాలంటూ వచ్చిన గుర్తు తెలియని ఓ వ్యక్తి మెడికల్ షాపు క్యాష్ కౌంటర్ లోనుంచి రూ.50 వేలు తస్కరించాడు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నంబర్- 12లోని అపోలో ఫార్మసీ మెడికల్ షాపులోకి ఉదయం 6.30 సమయంలో గుర్తుతెలియని ఓ వ్యక్తి వచ్చాడు. తనకు తీవ్రమైన తలనొప్పి ఉందంటూ చెప్పి.. ట్యాబ్లెట్ కావాలని కోరాడు. షాపులో పనిచేస్తున్న ఆదిల్ ట్యాబ్లెట్ కోసం పక్కకు తిరగగానే.. వచ్చిన ఆ వ్యక్తి క్యాష్ కౌంటర్ లోనుంచి రూ.50 వేల నగదును తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు. అతడిని పట్టుకునేందుకు ఆదిల్ ప్రయత్నించినా.. లాభం లేకుండా పోయింది. అపోలో ఫార్మసీ సీనియర్ మేనేజర్ సాగర్ ఇచ్చిన ఫిర్యాదుతో గుర్తుతె లియని వ్యక్తిపై ఐపీసీ 420, 380 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.