శంషాబాద్ రూరల్, జూన్ 18: శంషాబాద్ ఎయిర్పోర్టులో ఓ ప్రయాణికుడి వద్ద బంగారం లభ్యమైంది. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడిపై అనుమానం వచ్చి తనిఖీలు చేయగా, పేస్టు రూపంలో ఉన్న 353.7 గ్రాముల బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
దీని విలువ రూ. 18.61 లక్షలు ఉంటుందని,దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.