బాలానగర్, ఏప్రిల్ 24 : కూకట్పల్లి సీతారామచంద్రస్వామి (రామాలయం)లో జరుగుతున్న ఆలయ పునః ప్రతిష్ఠ మహోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. సోమవారం సీతారామచంద్రస్వామివారి విగ్రహ పునః ప్రతిష్ట మహోత్సవం జరుగనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచే ఆలయంలో భక్తుల సందడి పెరిగింది. ఐదోరోజు ఆదివారం ఉదయం నుంచే ఆలయ ప్రాగంణంలో నిత్య హోమాలు, 81 కలశాభిషేకం, యాగశాలలో సుదర్శన.. ద్వజ స్తంభ ప్రాణప్రతిష్ఠ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆలయ పుణఃప్రతిష్ఠా వేడుకలకు మంత్రి మల్లారెడ్డి విచ్చేసి స్వామివార్లను దర్శించుకొన్నారు.
అనంతరం మల్లారెడ్డికి ఆలయ కమిటీ చైర్మన్ తులసీరావు శాలువా కప్పి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు, ఆయన కుమారుడు సందీప్రావు, కోడలు అమూల్య, కుమార్తె శ్రీలత, అల్లుడు పొన్నాల విదుత్లతో పాటు కూకట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ దంపతులు, వివేకానందనగర్కాలనీ కార్పొరేటర్ మాధవరం రోజాదేవి దంపతులు వివిధ పూజలలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. ఆల్విన్కాలనీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేశ్గౌడ్, బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్రెడ్డి, పతేనగర్ కార్పొరేటర్ సతీశ్గౌడ్ పాల్గొన్నారు.
హాజరుకానున్న రామానుజ చిన జీయర్స్వామి..
సోమవారం ఉదయం 10. 25 గంటలకు త్రిదండి రామానుజ చిన జీయర్స్వామి కరములచే స్వామివార్ల విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నారు.