హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): సింగరేణి పట్ల సీఎం కేసీఆర్కు వెలకట్టలేని అభిమానం ఉన్నదని రాష్ట్ర స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సింగరేణి కార్మికుల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సీఎం కేసీఆర్ పదే పదే చెబుతారని ఆమె గుర్తు చేశారు. మంగళవారం హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయంలో సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ను ఆమె ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం అసోసియేషన్ అధ్యక్షుడు భాసర్రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. అలాగే స్త్రీ, శిశు సంక్షేమశాఖ జాయింట్ డైరెక్టర్లు, కేఆర్కే లక్ష్మీదేవి, జీకే, సునంద, జీసీసీ జీఎం సీతారాంనాయక్తోపాటు అధికారులు, యూనియన్ సభ్యులు మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి సత్యవతి రాథోడ్కు వైరా ఎమ్మెల్యే లావుడ్యా నాయక్, రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు, గురుకుల సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రోస్, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, రెడో చైర్మన్ వై.సతీశ్ రెడ్డి, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ కే.వాసుదేవ రెడ్డి, గిరిజన సంక్షేమశాఖ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్రెడ్డి, బోడుప్పల్ కార్పొరేటర్ సుమన్, తదితరులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.