సిటీబ్యూరో, జూన్ 27 (నమస్తే తెలంగాణ) : బంగాళాఖాతంలో అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తన ప్రభావంతో నగరంలో మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు వివిధ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. పటాన్చెరువు పరిధిలో 5.8 మిల్లీమీటర్లు, మలక్పేట, రామచంద్రాపురంలలో 5.5మి.మీ., ఎల్బీనగర్లో 5.0 మి.మీ., సంతోష్నగర్, చార్మినార్లలో 4.8మి.మీ.,
కార్వాన్లో 4.0 మి.మీ., అల్వాల్, కుత్బుల్లాపూర్ల్లో 2.3 మి.మీ., గాజులరామారం, గచ్చిబౌలిల్లో 2.0మి.మీ.గా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అలాగే రాగల రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మంగళవారం గరిష్ఠ ఉష్ణోగ్రత 31.6, డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత 24.0 డిగ్రీలు, గాలిలో తేమ 73 శాతం నమోదైనట్లు వెల్లడించారు.